ఖమ్మంవన్టౌన్: రంజాన్ మాసం ందర్భంగా ప్రభుత్వం తరఫున ఖమ్మంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్తో పాటు నాయకులు మహమ్మద్ ముస్తఫా, ఆశ్రిఫ్, చోటేబాబా, రషీద్, సాధు రమేష్రెడ్డి, ముజాహిద్ హుస్సేన్, ముక్తార్పాషా తదితరులు పాల్గొన్నారు.