2023 నుంచి పెచ్చుమీరిన వంచనలు | - | Sakshi
Sakshi News home page

2023 నుంచి పెచ్చుమీరిన వంచనలు

Jul 31 2025 7:02 AM | Updated on Jul 31 2025 8:52 AM

2023 నుంచి  పెచ్చుమీరిన వంచనలు

2023 నుంచి పెచ్చుమీరిన వంచనలు

గత నాలుగేళ్ల వంచన వివరాలు గమనిస్తే 2023లో సైబర్‌ వంచన ముఠా పెచ్చుమీరింది. 2022లో సైబర్‌ సహాయవాణికి 1.30 లక్షల ఫోన్‌కాల్స్‌ అందగా వీటిలో రూ.113 కోట్లు దోచేశారు. సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అందిన ఫిర్యాదుల మేరకు రూ.8 కోట్లు ఫ్రీజ్‌ చేశారు. 2023లో 4,67,258 ఫోన్‌కాల్స్‌ చేయగా వంచనకు గురైన మొత్తం రూ.562 కోట్లు(11.7 శాతం) పెరిగింది. అనంతర సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు దేశంలో పెచ్చుమీరిన సైబర్‌ వంచనల కేసులు సైబర్‌ పోలీసుల్లో కలకలం రేపుతోంది. 2024లో సుమారు 10,79,458 ఫోన్‌కాల్స్‌ సైబర్‌ సహాయవాణికి అందాయి. వంచన మొత్తం రూ.2,396 కోట్లకు చేరింది. ఇందులో కేవలం రూ.226 కోట్లు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం 5 నెలల్లో 6.71 లక్షల ఫోన్‌కాల్స్‌ రావడంతో రూ.938 కోట్లు వంచనకు గురికాగా రూ.135 కోట్లు ఫ్రీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement