నీటి నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

నీటి నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయండి

Jul 20 2025 5:39 AM | Updated on Jul 21 2025 5:47 AM

నీటి నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయండి

నీటి నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయండి

హొసపేటె: జేజేఎం పనుల నిర్వహణకు జీపీ ద్వారా గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య కమిటీని ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్‌ మహ్మద్‌ అలీ అక్రమ్‌ షా అన్నారు. తాలూకాలోని బెళగోడు, కడ్డిరాంపుర, కలఘట్ట, నరసాపుర, బెనకాపుర, మలపనగుడి గ్రామాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు కింద పూర్తయిన పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామీణ తాగునీరు, పారిశుధ్య కమిటీని మార్గదర్శకాల ప్రకారం కార్యాచరణ, నిర్వహణ విధానాన్ని అమలు చేయాలని ఆయన అక్కడ ఉన్న జీపీ అధికారులను ఆదేశించారు.

శుద్ధ తాగునీటి యూనిట్‌ పరిశీలన

ఆయన మలపనగుడి మల్టీ గ్రామ శుద్ధ తాగునీటి యూనిట్‌ను పరిశీలించారు. తాగునీరు, పారిశుద్ధ్య విభాగం డివిజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌.దీప, తాలూకా వైద్యాధికారి బసవరాజు, ట్యాప్‌ ఈఓ ఎండీ ఆలంబాషా, పీఆర్‌ఈడీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సురేష్‌, గ్రామీణ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వీరేష్‌ నాయక్‌, జూనియర్‌ ఇంజినీర్‌ సురేష్‌, నాగేనహళ్లి పీడీఓ వాసుకి, వీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్‌ మహ్మద్‌ అలీ అక్రమ్‌ షా

తాలూకాలోని వివిధ ప్రదేశాల్లో పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement