
పాలికె కమిషనర్ బదిలీ
హుబ్లీ: ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాలేదు. మరొక కమిషనర్ బదిలీ. రెండేళ్లలో ఇద్దరు కమిషనర్లు బదిలీ. ప్రస్తుతం బదిలీ అయిన సదరు కమిషనర్ పోస్టులోకి ఎవరు వస్తారు అన్నది కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. బెంగళూరు తర్వాత రెండవ పెద్ద పాలికె అయిన హుబ్లీ ధార్వాడ జోన్లో చర్చ జరుగుతున్న పెద్ద ప్రశ్న ఇది. ప్రస్తుతం కమిషనర్ డాక్టర్ రుద్రేశ్ గాళి బదిలీ అయ్యారు. స్మార్ట్ సిటీ ఎండీగా పని చేస్తున్న ఈయన జనవరి 25న పాలికె కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఉన్న డాక్టర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి రెండేళ్ల కన్నా ముందే అంటే ఏడాదిన్నరకే బదిలీ అయ్యారు. ఇప్పుడేమో 6 నెలలు పూర్తి కాకుండానే కమిషనర్ బదిలీ కావడంపై వాడీవేడిగా సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. రుద్రేష్ను విద్యా శాఖ ధార్వాడ విభాగం కమిషనర్గా నియమించారు. ఆ పోస్టులో ఉన్న జయశ్రీ సింత్రేను బదిలీ చేశారు. ఆమెకు ఏ పోస్టు ఇవ్వలేదు. రుద్రేష్ వల్ల ఖాళీ అయిన స్థానానికి ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. డాక్టర్ రుద్రేష్ గాళి పాలికె కమిషనర్గా అధికారం చేపట్టినప్పటి నుంచి ఈయన తన విధుల నుంచి తప్పుకోవాలని ఉన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల వల్ల తెలిసింది. దీంతో బదిలీపై చర్చలు టైమ్ పాస్ చేయడానికి వస్తారు. ప్రజాసక్తితో చిత్తశుద్ధి లేకపోవడంతో ఏవేవో సాకులు చెబుతున్నారని తెలుస్తుంది.
బదిలీకి సిఫార్సు లేఖ.!
కాగా రుద్రేష్కు 6 నెలల పాటు పని చేయాలని సలహా ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు. దీంతో 6 నెలలు గడవడానికి ముందే ఈయన బదిలీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ అయిన వ్యక్తి ద్వారా బదిలీ సిఫారసు లేఖ పొందారన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా సూపర్ టైమ్ స్కేల్ హోదా గల డాక్టర్ రుద్రేష్ గాళికి ఐఏఎస్ ప్రమోషన్ అవుతున్నట్లుగా కూడా వినిపిస్తోంది. ఇటీవల ఆయన ధృవీకరించారు కూడా. ఈ నెల చివరన లేదా ఆగస్టు నెలలో పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. కాగా పాలికెలో సభా నాయకుడు తిప్పణ్ణ మజ్జిగి మాట్లాడుతూ రుద్రేష్ బాగా విధులు నిర్వహించారు. దుస్థితిలో ఉన్న పాలికెను ప్రగతి బాటలో నడిపించడానికి కృషి చేశారు. ఆయన ఈ తీరును కొందరు జీర్ణించుకోలేక పోయారు. మాటిమాటికీ బదిలీ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఐఏఎస్ కేడర్ అధికారినే పాలికె కమిషనర్గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
నాలుగు నెలలకే స్థానభ్రంశంపై
తీవ్రంగా చర్చోప చర్చలు