
పశువుల కొట్టానికీ అతీగతీ లేదు
హుబ్లీ: పశువుల కొట్టాన్ని నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయని గ్రామ పంచాయతీ కార్యాలయం తీరుకు నిరసనగా బాధిత రైతన్న ఆ పశువులను కార్యాలయం ఎదుట కట్టి వేసి వినూత్నంగా నిరసన తెలిపి ఆందోళన చేపట్టారు. హావేరి జిల్లా రాణి బెన్నూరు తాలూకా కవలెత్తు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామ రైతు చంద్రప్ప ఈ వినూత్న ఆందోళన చేపట్టారు. ఆ గ్రామ పంచాయతీ ధ్వజస్తంభానికి పశువులను, దూడలను కట్టి ఆక్రోశం వెళ్లగక్కారు. ఆయన మాట్లాడుతూ 2021లో ఉపాధి హామీ పథకం ద్వారా ఆయన తల్లి ఫక్కీరవ్వకు కొట్టం మంజూరైంది. ఆ మేరకు గత నాలుగేళ్ల నుంచి పీడీఓ, కార్యదర్శి సదరు నిధులను మంజూరు చేయడానికి వేధిస్తున్నారన్నారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పీడీఓ స్పందించలేదని, అందుకే పశువులతో కార్యాలయానికి వచ్చానన్నారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని, అంత వరకు తాను, తన పశువులతో ఇక్కడే ఉంటానని ఆయన భీష్మించారు.
నిధులు మంజూరై ఐదేళ్లైనా
అందని వైనం
జీపీ కార్యాలయం ఎదుట
రైతన్న వినూత్న నిరసన