ప్రయాణికుల పాలిట ప్రమాద ఘంటికలుగా మారాయి. వాహనాల స్పీడును తగ్గించేందుకు కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై వైద్య కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సూచికల బోర్డులు ప్రమాదకరంగా మారాయి. వేగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్ జరగకుండా బండలు పెట్టడం ప్రయాణానికి తలనొప్పిగా మారుతోంది. వాహనాల తాకడికి స్టాఫర్లు ఓ వైపు, బండలు మరోవైపు జరిగి చెల్లాచెదురు అవుతున్నాయి. పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. – కొత్తపల్లి(కరీంనగర్)


