విద్యతోనే భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే భవిష్యత్‌

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

విద్యతోనే భవిష్యత్‌ ● ‘సుడా’ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి దేవాదాయ శాఖ కార్యాలయాల్లో ధర్మవాణి కరీంనగర్‌కల్చరల్‌: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయంలో నెలకొన్న సమస్యలపై ఽప్రతీ సోమవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేవాదాయ శాఖ కార్యాలయాల్లో ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ నాయిని సుప్రియ తెలిపారు. ప్రతీ శనివారం ఒక ఆలయం దర్శనం, ఆలయ సమస్యల పరిష్కారం కార్యక్రమం గత నెల నుంచి చేపట్టినట్లు తెలిపారు.

● ‘సుడా’ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి

కరీంనగర్‌ టౌన్‌: ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక నిధులు వెచ్చిస్తోందని, విద్యాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కరీంనగర్‌అర్బన్‌, రూరల్‌, కొత్తపల్లి మండలాల కార్పొరేటర్లు, సర్పంచులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్‌, డైట్‌ ప్రిన్సిపాల్‌, ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డీఈవో శ్రీరాం మొండయ్య, ఎంఈవోలు ఆనందం, భద్రయ్య, వాసవి, జిల్లా సైన్స్‌ అధికారి చాడ జయపాల్‌ రెడ్డి, జీసీడీవో ఉమ, ఆర్పీలు గాజుల రవీందర్‌, కేఎస్‌.అనంతాచార్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement