ఆర్మేనియాలో బోయినపల్లి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్మేనియాలో బోయినపల్లి యువకుడి మృతి

Jan 12 2026 7:40 AM | Updated on Jan 12 2026 7:40 AM

ఆర్మేనియాలో బోయినపల్లి యువకుడి మృతి

ఆర్మేనియాలో బోయినపల్లి యువకుడి మృతి

బోయినపల్లి(చొప్పదండి): బతుకుదెరువుకు యూరప్‌ లోని ఆర్మేనియా దేశానికి వెళ్లిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్‌(33) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. బోయినపల్లికి చెందిన మేకల సత్తవ్వ–గంగారాం దంపతుల కుమారుడు ప్రవీణ్‌ 9 నెలల క్రితం రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఆర్మేనియా వెళ్లాడు. అక్కడ కారు నడుపుతూ ఉపాధి పొందేవాడు. గత శుక్రవారం రోడ్డు పక్కన ఉండగా ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అక్కడి స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి తెలపడంతో వారు బోరున విలపిస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య కవిత, కూతురు శ్రావణి(14), కుమారులు సంజయ్‌(10), అభినయ్‌(5)ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement