యువకుడిపై కత్తిపోట్లు
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామశివారులో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శశిప్రీతమ్పై అదే గ్రామానికి చెందిన శ్రీధర్ వివాహేతర సంబంధం అనుమానంతో కత్తితో దాడి చేసినట్లు వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న శ్రీధర్ భార్య కరీంనగర్లోని ఓ మార్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. శశిప్రీతమ్ కరీంనగర్లోని కారు షోరూంలో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం శశిప్రీతమ్ భార్య వచ్చి శ్రీధర్ భార్యతో గొడవ పడ్డారు. ఈవిషయం తెలుసుకున్న శ్రీధర్ మాట్లాడుకుందామని శశిప్రీతమ్ను రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బోయినపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్దామని కొదురుపాక మీదుగా వస్తుండగా దేశాయిపల్లి గ్రామశివారులో శ్రీధర్ అనే వ్యక్తి శశిప్రీతమ్ను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని రూరల్ సీఐ శ్రీనివాస్ సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.


