
లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.7లక్షలకు టోకరా
సిరిసిల్లక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి ఏకంగా రూ.7లక్షలు దండుకున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు గురువారం కటకటాలకు పంపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్ జిల్లా పిల్లోనా మండలం సీపూర్కు చెందిన కపిల్శర్మ, అదే ప్రాంతంలోని ఇస్మాయిల్పూర్కు చెందిన పంకజీ కౌశిక్ ఇద్దరు కలిసి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఓ వెబ్ అప్లికేషన్ లింక్ను రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుగులోతు రమేశ్కు 2024, డిసెంబర్ 8న పంపారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టబడి పెడితే అధి క లాభాలు వస్తాయని నమ్మించి రూ.2500 పెట్టుబడిగా పెట్టించారు. మరుసటి రోజు అదనంగా డబ్బులు వచ్చాయి. దీన్ని నమ్మిన రమేశ్ విడతల వారీగా రూ.7లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తర్వాత ఆ వెబ్సైట్ కనిపించలేదు. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన రమేశ్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఎస్సై జునైద్, హెడ్ కానిస్టేబుల్ గంగారం, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేశ్ నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు.
వెబ్లింక్తో మోసానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా
రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్ బీ గీతే