
జీప్యాట్లో విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్క్రైం: జాతీయ స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో శాతవాహన ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఎస్.సాయి మనిదీప్, ిసీహెచ్ చక్రధర్, బి.మాధురి, ఎన్.శిరీష, ఎ.నిత్యారెడ్డి, ఎం.అరుణ్, డి.పండరీనాథ్, సానియా, జి.సుగంధిక, ఎ.వర్ష ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీశైలం తెలిపారు. వారిని వీసీ ఉమేశ్కుమార్, రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందించారు. ఓఎస్డీ హరి కా ంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, విభాగా ధిపతి అర్చన, అధ్యాపకులు భాగ్యలక్ష్మి, అనిల్కుమార్, క్రాంతిరాజు,జె.అశ్విని పాల్గొన్నారు.
జేసీబీతో పని పేరిట మోసం
సిరిసిల్లక్రైం: జేసీబీతో భూమి చదును చేసే పనులు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బులు గుంజుతున్న ఇద్దరిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గోల్కొండ చందుకుమార్, చింతపట్టి జిల్లాలోని పలువురు జేసీబీ యజమానులకు ఫోన్ చేశారు. వేములవాడ సమీపంలోని అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని.. అందులో చెట్లను చదును చేయడానికి జేసీబీ కావాలని కోరారు. ఎంట్రీ ఫీజు కోసం రూ.9 వేలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికారు. డబ్బులు పంపిన వారు పని కోసం ఫోన్చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వీరి బాధితులు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఇద్దరు, ఎల్లారెడ్డిపేటలో ఒకరు ఉన్నట్లు తెలిపారు.