తాడ్వాయి : పంటలను చేతికి వచ్చిన పంటలను కాపాడుకోవడానికి రైతులు పాత చీరలను వాడుతున్నారు. మొక్క జొన్న, సోయా, పత్తి, చెరుకు, కూరగాయలు పంటలలో కోతులు, అడవి పందులు గుంపులు–గుంపులుగా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. కామారెడ్డితో పాటు తదితర ప్రాంతాలలో జరిగే సంతలకు వెళ్లి రైతులు పాత చీరలను కొను గోలు చేసి, పంటల చుట్ట్టూ చుట్టుతున్నారు.
బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని బ్యాంకులు, ప్రముఖ షాపింగ్మా ల్స్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. బాన్సువాడలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచి, తాడ్కోల్రోడ్లో ఉన్న మరోబ్రాంచ్ వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.


