సాక్షి నెట్వర్క్:కుమారుడు పోక్సో కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రిగా ఉండి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ నేతలు వినతిపత్రాలు అందించి మాట్లాడారు. బాలికపై అత్యాచారం కేసు విషయంలో బీజేపీ మౌనంగా ఉండటం సరికాదన్నారు.


