గ్యాస్‌ నింపుతుండగా అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ నింపుతుండగా అగ్ని ప్రమాదం

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

రెండు వ్యాన్‌లు, కారు, ఓ బైక్‌ దగ్ధం

కామారెడ్డి పట్టణంలోని

దేవునిపల్లిలో ఘటన

కామారెడ్డి క్రైం: గృహ వినియోగ సిలిండర్‌లో నుంచి కారులోకి గ్యాస్‌ నింపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించి రెండు వ్యాన్‌లతోపాటు ఓ కారు, బైక్‌ దగ్ధమయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలి టీ పరిధిలోని దేవునిపల్లిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. సురేశ్‌, శ్రీశైలం అనే ఇద్దరు వ్యక్తు లు వారి ఇంటికి సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో వేసి ఉన్న రేకుల షెడ్డులో కొంత కాలంగా తమ కార్లను పార్కింగ్‌ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా గృహ వినియోగ సిలిండర్‌ నుంచి ఓ వ్యాన్‌లోకి గ్యాస్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షెడ్డులో ఉన్న అన్ని వాహనాలకు వ్యా పించాయి. స్ధానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే రెండు ఈకో వ్యాన్‌లు, ఓ బెలెనో కారు, ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యా యి. ప్రమాదానికి కారణమైన గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌, రీఫిల్లింగ్‌ మిషన్‌లను దేవునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చేవరకు కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement