సుభాష్నగర్: పంచముఖి మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని 6వ డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతిరెడ్డి అన్నారు. నగరంలోని వినాయక్నగర్ పంచముఖి మున్నూరు కాపు సంఘం భవనంలో సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్పొరేటర్ స్రవంతిరెడ్డితోపాటు పదోన్నతి పొందిన సంఘ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి, స్వర్ణలతను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా స్రవంతిరెడ్డి మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. డివిజన్ అభివృద్ధితోపాటు ఎన్నికల్లో సహకరించిన సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మాట్లాడి నిధులు అందేలా చూస్తామన్నారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిద్దె రవికుమార్, దారం పోతన్న, కోశాధికారి కర్క రమేష్, గౌరవాధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారుడు చిట్టి నారాయణరెడ్డి, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్ పాల్గొన్నారు.


