ఘనంగా మల్లన్న కళ్యాణం
బీబీపేట: రెండు రోజులుగా ఉప్పర్పల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కేతమ్మ మేడాలమ్మ, మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మల్లికార్జున స్వామి కల్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను యాదవ సంఘం సభ్యులు, భక్తులు భక్తి శ్రద్ధలతో తొక్కారు. భక్తులకు అన్నదానం చేశారు.
సిద్ధగిరి సమాధి వద్ద పూజలు ప్రారంభం
భిక్కనూరు: మండల కేంద్రంలోని అతిపురాతనమైన సిద్ధగిరి సమాది వద్ద సోమవారం పూజలు ప్రారంభమయ్యాయి. ప్రతి సోమవారం పూజలు చేసేందుకు రాజశేఖర్ అనే పంతులును ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.


