క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
● భార్యకు తీవ్ర గాయాలు
బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా బా న్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెంద గా, భార్య తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నాగధార్ మండలం గరుకుచెట్టుతండాకు చెందిన కెతావత్ వసూరాం (52), తన భార్య దూరిబాయితో కలిసి టీవీఎస్ ఎక్సెల్పై మంగళవారం కామారెడ్డి వైపు బయలుదేరారు.
కొయ్యగుట్ట తండా మూలమలుపు వద్ద వారి వాహనాన్ని ఓ కారు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం కారు స్తంభాన్ని ఢీకొట్టి నిలి చిపోయింది. ఈ ఘటనలో వసూరాం అక్కడికక్కడే మృతి చెందాడు. దూరిబా యి తీవ్రంగా గాయపడగా, బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.
గాయపడిన దూరిబాయి , ప్రమాదానికి కారణమైన కారు
క్రైం కార్నర్
క్రైం కార్నర్


