
పార్టీ వదలి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోం
కామారెడ్డి క్రైం/భిక్కనూరు : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది అధికారం పోగానే కాంగ్రెస్లో చేరిన నేతలను తిరిగి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో, కామారెడ్డి పట్టణ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేశామని కాంగ్రెస్నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వంద శాతం రుణమాపీ జరిగినట్లు నిరూపిస్తే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను కన్నతల్లికి మోసం చేసిన వారిగానే పరిగణిస్తామన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజత్సోవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో చలో వరంగల్ ఆటో స్టిక్కర్ లను ఆటోలకు ఆయన అతికించారు.
బీఆర్ఎస్ లో పలువురు యువకుల చేరిక..
జిల్లా కేంద్రానికి చెందిన 30 మంది యువకులు మంగళవారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రేస్ నాయకులు యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంభాల రవి, ప్రభాకర్ యాదవ్, క్రిష్ణాజీ రావు, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు, నాయకులు పిట్ల వేణు, లక్ష్మీ నారాయణ, స్వామి, గైని శ్రీనివాస్, హాఫిజ్ భాను ప్రసాద్, కాంగ్రెస్ నేతలు అత్తెల్లి శ్రీనివాస్, నాగార్తి భూంరెడ్డి, వంగేటి చిన్ననర్సరెడ్డి, అందే మహేందర్రెడ్డి, తున్కి వేణు, పాలరాంచంద్రం, ద్యావర సాయిరెడ్డి, రవీందర్రెడ్డి, బస్వయ్య, ఎనుగు వెంకట్రెడ్డి, వలకొండ వెంకట్రెడ్డి. అంబల్ల మల్లేషం, తక్కళ్ళ రవీందర్రెడ్డి, అనంత్గౌడ్, ముచ్చర్ల రాజిరెడ్డి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
రుణమాీఫీ వందశాతం చేసినట్లు
నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్