
‘భద్రత’తో పోలీసు కుటుంబాలకు భరోసా
కామారెడ్డి క్రైం: భద్రత పథకం కింద మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రామన్ అనే కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరైన రూ. 8 లక్షల పోలీసు భద్రత చెక్కును సోమవారం కుటుంబ సభ్యులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రావాల్సిన సదుపాయాలను వీలైనంత త్వరగా ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో అఫ్సరుద్దీన్, సూపరింటెండెంట్ నయీం, సిబ్బంది పాల్గొన్నారు.
బెట్టింగులు, ఆన్లైన్ గేమ్లపై ఉక్కుపాదం
లింగంపేట(ఎల్లారెడ్డి): బెట్టింగులు, ఆన్లైన్ గేమ్లపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్రం వెల్లడించారు. సోమవారం ఆయన లింగంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగులు పెరగడంతో వాటిపై నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 73 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. అలాగే కల్తీ కల్లులో అల్ప్రాజోలం వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన కొంత మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మత్తు మందులు గుర్తించడానికి టెస్టింగ్ కిట్లు వచ్చాయని, ల్యాబ్కు పంపకుండానే ఎంత మేరకు మత్తు మందు కలిపారనేది తేలిపోతుందన్నారు.
ఎస్పీ రాజేష్ చంద్ర