
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
లింగంపేట: భూభారతి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం పర్మళ్ల, పొల్కంపే ట గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించా రు. పర్మళ్ల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్దా లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని చట్ట ప్రకా రం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతులు తమ స మస్యలను దరఖాస్తులో స్పష్టంగా రాసి అందించా లన్నారు. భూభారతి పోర్టల్లో భూముల రిజిస్ట్రే ష న్లు, సాదాబైనామాలు, రెవెన్యూ భూ రికార్డుల్లో తప్పుల సవరణ, వారసత్వ భూములు, సర్వే నంబర్లలో తప్పులు, ఒకరి భూమి మరొకరి పేరుపై నమోదు కావడం, సర్వే నంబర్లు తప్పుగా నమోదు కావడం తదితర సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. భూ సమస్యలను జూన్ 2లోగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పరిష్కారం కాని సమస్యల పై ట్రిబ్యునల్కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
పర్మళ్లలో 165 దరఖాస్తులు, పొల్కంపేటలో 165 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపా రు. పర్మళ్లలో 331 సర్వే నంబరులో పలువురు రైతులకు చెందిన 62 ఎకరాలు, 380 సర్వే నంబరులో మరికొంతమంది రైతులకు సంబంధించిన 96 ఎకరాలు, 400 సర్వే నంబరులో 120 ఎకరాలు సీలింగ్ భూములుగా నమోదయ్యాయని అధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. వాటిపై విచారణ చేపట్టి పరిష్కా ర మార్గాలు చూపుతామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్లో..
పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధరణి వల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభు త్వం భూభారతి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మండల ప్రత్యేకాధి కారి కిషన్, తహసీల్దార్ దశరథ్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రెడ్డి, ఏవో కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం