రజతోత్సవ సభను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

Apr 22 2025 2:15 AM | Updated on Apr 22 2025 2:15 AM

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

కామారెడ్డి క్రైం : వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నె ల 27న జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాజంపేట, కామారెడ్డి మండలాల పార్టీ నేతలతో సన్నాహక సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇ చ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి గాలికి వదిలేశా రని ఆరోపించారు. హామీల అమలు చేతకాక ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు అమలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో మాజీ సీఎం కేసీ ఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. బీఆర్‌ఎస్‌ సభకు నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ గోపి గౌడ్‌, పార్టీ మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, బలవంతారావు, సింగిల్‌ విండో చైర్మన్‌ నల్లవెల్లి అశోక్‌, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, నాయకులు మోహన్‌రెడ్డి, గూడెం బాల్‌రాజు, కమలాకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement