రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో వెంకటేష్‌ ప్రథమం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో వెంకటేష్‌ ప్రథమం

Aug 28 2026 12:15 AM | Updated on Aug 28 2026 12:15 AM

అమలాపురం టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యాన బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీ విద్యార్థి తాడి సాయి వెంకటేష్‌ 7/7 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి, చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకున్నాడు. తమ అకాడమీ నుంచి మొత్తం 15 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని ప్రిన్సిపాల్‌ టి.వెంకట సురేష్‌ తెలిపారు. కుడుపూడి తేజస్‌ 4, తామర ప్రసన్న 5 స్థానాలు సాధించారన్నారు. వివిధ వయస్సుల కేటగిరీల్లో పనిశెట్టి ధరణి, వంటెద్దు లక్ష్మీ శరణ్య, ఎం.లగీమా, కారుపర్తి కార్తికేయ, పిడుగు ప్రణీల్‌, అల్లకం ప్రమోద్‌ ప్రథమ స్థానాలు సాధించారని వివరించారు. విజేతలను పశ్చిమ గోదావరి జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement