త్వరగా పూర్తిచేయండి.. | - | Sakshi
Sakshi News home page

త్వరగా పూర్తిచేయండి..

May 17 2026 1:06 AM | Updated on May 17 2026 1:06 AM

సాగునీటి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ బోర్లతోనే పంటలు పండిచుకుంటున్నారు. వర్షాలు వస్తేనే బోర్లలో నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షాలు లేకపోతే బోర్లు ఎండిపోతాయి. ప్రభుత్వం గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

– గోలానాయక్‌, రైతు, మల్లాపురం తండా

వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం

గిపోయిన గట్టు ఎత్తిపోతల పథకం పనులను మళ్లీ ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలి. ఎత్తిపోతల పథకంతో సాగునీటిని ఇక్కడి బీడు భూములకు పారించాలి. ఆ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

– కావలి నర్సింహులు, రైతు రాయాపురం

కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంది..

ట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అంచనాలను తయారుచేసి పంపడం జరిగింది. ప్రాజెక్టు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలని రూపొందించిన డీపీఆర్‌ రాష్ట్ర కేబినేట్‌ ముందు ఉంది. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం.

– రహిమొద్దీన్‌, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ

Advertisement
 
Advertisement
Advertisement