శాంతినగర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటుచేస్తే రైతులు పంటలు నష్టపోతారని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్కు పెద్ద ధన్వాడ ప్రజలు విన్నవించారు. ప్రజలకు, రైతులకు నష్టం వాటిల్లే ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దుచేయించాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, వడ్డేపల్లి మండలం కొంకలకి చెందిన ఎం.శారదమ్మ అనారోగ్యానికి గురికాగా ఆమె ఆపరేషన్ ఖర్చుల కొరకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ కాపీని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ కుటుంబసభ్యులకు అందజేశారు.
ఆర్డీఎస్కు నీరందించండి..
ఆర్డీఎస్ కెనాల్కు నీటిని విడుదల చేయించాలని ఆయకట్టు రైతులు ఆయనను కోరారు. వడ్డేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సోమవారం శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో కలిసి నీటిని విడుదల చేయించాలని కోరారు. స్పందించిన ఏఐసీసీ కార్యదర్శి నీటిని విడుదల చేయించేందుకు తన వంతు కృషిచేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.