దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి

Apr 24 2025 1:56 AM | Updated on Apr 24 2025 1:56 AM

దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి

దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియ న్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగా లు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మల్లయ్య, కమలాకర్‌, మహేష్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement