జనగామ: హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఆదివారం జరిగిన మారథాన్న్ కార్యక్రమానికి జిల్లా వాకర్లు తరలివెళ్లారు. జిల్లా నుంచి అడ్వొకేట్ పానుగంటి శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ మారథాన్ నిర్వహించినట్లు తెలిపారు. యువతలో ఫిట్నెస్పై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తి వీరేందర్, మరాఠీ శ్రీశైలం, కుమారస్వామి, శ్రీనివాస్, ఉమేష్, మల్లికార్జునచారి, కసాబు రమేష్, బూరెల రామకృష్ణ, కానిస్టేబుళ్లు శాడ పోచయ్య, కోల భానుచందర్ ఉన్నారు.


