
‘భూభారతి’ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
జనగామ రూరల్: ‘భూభారతి’ దరఖాస్తులను అధికారులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి, జాతీయ కుటుంబ లబ్ధి పథకం(ఎన్ఎఫ్బీఎస్) సన్న బియ్యం, బీఎల్ఓలకు శిక్షణ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి దరఖాస్తుల విషయంలో వాస్తవాలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పారు. సర్వే నంబర్ మిస్ మ్యాచ్ అయితే నోటీసు ఇవ్వాలని సూచించారు. సాదాబైనామా, అసైన్డ్ లాండ్లను దశల వారీగా పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో జాతీయ కుటుంబ లబ్ధి పథకానికి వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా విభజించి నివేదిక అందించాలని సూచించారు. సన్న బియ్యం పంపిణీ వేగంగా చేపట్టేందుకు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చేందుకు మండల స్థాయిలో అనువైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంతు నాయక్, జిల్లా సివిల్ సప్లయీస్ డీఎం హతిరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక వనరుగా ఇందిరా మహిళా శక్తి పథకం
బచ్చన్నపేట: రాష్ట్రంలో కోటి మంది మహిళా మణులను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇంది రా మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. ఈ పథకం మహిళలకు ఆర్థిక వనరుగా దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. బచ్చన్నపేట మండలం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన వనిత టీ స్టాల్ను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పా రు. ఎస్హెచ్జీ సభ్యురాలుగా కొనసాగుతున్న పోచన్నపేటకు చెందిన రేణుక రచన మహిళా సమాఖ్య ద్వారా రూ.2 లక్షలు ఋణం పొంది వనిత టీ స్టాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిమాండ్కు తగినట్టుగా వ్యపారం పెంచుకోవాలని సూచించారు. డీఆర్డీఓ వసంత, మండల స్పెషల్ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ మల్లికార్జు న్, డీటీ ఫణికుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా

‘భూభారతి’ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి