ముగిసిన ‘బడిబాట’ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘బడిబాట’

Jun 20 2025 5:55 AM | Updated on Jun 20 2025 5:55 AM

ముగిసిన ‘బడిబాట’

ముగిసిన ‘బడిబాట’

జనగామ: సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచుకునేందుకు ఈనెల 6న ప్రారంభించిన జయశంకర్‌ ‘బడిబాట’ గురువారంతో ముగిసింది. జిల్లాలో 14 రోజులపాటు ‘బడిబాట’ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న నాయకత్వంలో టీచర్లు ఇంటింటికీ వెళ్లారు. గ్రామ సభల నుంచి మొదలు చివరి రోజు క్రీడా పోటీలతో ముగింపు పలికారు. జిల్లాలో నూతన అడ్మిషన్లు 2,605 వరకు రాగా, ఇందులో రఘునాథపల్లి మండలం 490 మంది పిల్లలతో టాప్‌లో నిలువగా, రెండో స్థానంలో జనగామ–445, కొడకండ్ల 83 మందితో చిట్ట చివర స్థానంలో నిలిచింది. కాగా మరో నెల పాటు కొత్త అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

పండుగ వాతావరణంలో

నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, టెన్నికాయిట్‌, స్కిప్పింగ్‌ తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పగిడిపల్లి దామోదర్‌, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్‌రెడ్డి, అంగన్‌వాడీ టీచర్‌ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘బడిబాట’లో చేరిన పిల్లల వివరాలు

మండలం కొత్త

అడ్మిషన్లు

బచ్చన్నపేట 148

చిల్పూరు 125

దేవరుప్పుల 218

స్టేషన్‌ఘన్‌పూర్‌ 160

జనగామ 445

కొడకండ్ల 83

లింగాలఘణపురం 130

నర్మెట 146

పాలకుర్తి 216

రఘునాథపల్లి 490

తరిగొప్పుల 110

జఫర్‌గఢ్‌ 334

కొత్తగా 2,605 మంది విద్యార్థుల చేరిక

రఘునాథపల్లి టాప్‌.. చివరలో కొడకండ్ల

రోజువారీగా మరింత మంది చేరే

అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement