
ముగిసిన ‘బడిబాట’
జనగామ: సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచుకునేందుకు ఈనెల 6న ప్రారంభించిన జయశంకర్ ‘బడిబాట’ గురువారంతో ముగిసింది. జిల్లాలో 14 రోజులపాటు ‘బడిబాట’ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న నాయకత్వంలో టీచర్లు ఇంటింటికీ వెళ్లారు. గ్రామ సభల నుంచి మొదలు చివరి రోజు క్రీడా పోటీలతో ముగింపు పలికారు. జిల్లాలో నూతన అడ్మిషన్లు 2,605 వరకు రాగా, ఇందులో రఘునాథపల్లి మండలం 490 మంది పిల్లలతో టాప్లో నిలువగా, రెండో స్థానంలో జనగామ–445, కొడకండ్ల 83 మందితో చిట్ట చివర స్థానంలో నిలిచింది. కాగా మరో నెల పాటు కొత్త అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
పండుగ వాతావరణంలో
నర్మెట్ట మండలం మాన్సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, స్కిప్పింగ్ తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పగిడిపల్లి దామోదర్, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్రెడ్డి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.
‘బడిబాట’లో చేరిన పిల్లల వివరాలు
మండలం కొత్త
అడ్మిషన్లు
బచ్చన్నపేట 148
చిల్పూరు 125
దేవరుప్పుల 218
స్టేషన్ఘన్పూర్ 160
జనగామ 445
కొడకండ్ల 83
లింగాలఘణపురం 130
నర్మెట 146
పాలకుర్తి 216
రఘునాథపల్లి 490
తరిగొప్పుల 110
జఫర్గఢ్ 334
కొత్తగా 2,605 మంది విద్యార్థుల చేరిక
రఘునాథపల్లి టాప్.. చివరలో కొడకండ్ల
రోజువారీగా మరింత మంది చేరే
అవకాశం