విరిగిన తలుపులు..
ఊడిపోయే కుళాయిలు
● పైకప్పులకు రేకులు.. సపోర్టుగా కర్రలు
● క్వాలిటీ కంట్రోల్ లేకుండానే
బిల్లుల చెల్లింపు
● ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులపై
పర్యవేక్షణ కరువు
● ఆదరణ లేక మూతపడిన పాఠశాలలు
● ‘సాక్షి’ విజిట్లో వెలుగులోకి
అనేక సమస్యలు
పడిపోయిన పాఠశాల గ్రేడ్
దేవరుప్పుల: మున్పహాడ్ ప్రాథమికోన్నత పాఠశా ల నేడు ప్రాథమిక స్థాయికి పడిపోయింది. స్కూల్ లో ఏడుగురు పిల్లలే ఉన్నారు. పాత గదుల్లోనే బోధిస్తున్నారు. వదిలేసిన నూతన గదులు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్ర బిందువయ్యాయి.
‘ప్రైవేట్’పై మోజుతోనే..
సకల సౌకర్యాలతో ప్రభుత్వం ఉచి త విద్య అందిస్తున్నా పిల్లలను ప్రైవే ట్ స్కూళ్లకు పంపుతున్నారు. దీంతో సర్కారు చదువు దెబ్బతింటోంది.
– జ్ఞానానంద కీర్తి, టీచర్, మన్పహాడ్
టాయిలెట్లు లేని తిమ్మంపేట పాఠశాల
జాఫర్గడ్: తిమ్మంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. కొన్నేళ్లుగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి. దీనికి తోడు తరగతి గదుల తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో భద్రత లేకుండా పోయింది. వరండా, తరగతి గదుల్లోని బండలు కుంగిపోయాయి. భవనం పైపెచ్చులు ఊడి పోతున్నాయి. ప్రహరీ సైతం పలుచోట్ల కూలిపోయింది. దీంతో పాఠశాల మందుబాబులకు అడ్డగా మారింది.
టాయిలెట్లు నిర్మించాలి
తమ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి. బయటకు వెళ్లాల్సి వస్తుంది. పాఠశాల తరగతి గదులకు తలుపులు, కిటికీలు లేవు. ప్రహరీ పలుచోట్ల కూలింది. ఈ సమస్యలు పరిష్కరించాలి.
– కడబోయిన హరిప్రసాద్, 10వ తరగతి
జనగామ: ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారు.. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరిట కొత్త స్కీం తీసుకువచ్చి పాత పనులు పట్టించుకోకుండా.. కొత్త నిర్మాణాలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు మట్టిపాలు కాగా.. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పథకం కాంట్రాక్టర్లకు వరంగా మారింది. టాయిలెట్ల తలుపులు ఇప్పుడే విరిగి పోతుంటే.. ట్యాపులు ముట్టుకుంటే ఊడిపోయేలా ఉన్నాయి. భవనాల పైపెచ్చులు ఊడిపోయి.. ప్రహరీలు కూలిపోయి కొన్ని బడులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 ఉండగా, సుమారు 32వేల మంది చదువుకుంటున్నారు. విద్యార్థులు లేక సుమారు 65 పాఠశాలలు మూతపడగా ఒకటో తరగతి చదువుకునే పిల్లలు సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్లే పరిస్థితి నెలకొంది. గురువారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక సమ్యలు వెలుగులోకి వచ్చాయి.
ఒకటో తరగతి ఎలా..
బచ్చన్నపేట: సదాశివపేట ప్రాథమిక పాఠశాలలో ఇంతకు ముందు 20 మంది విద్యార్థులు చదువుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించడంతో ఈ స్కూల్ను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఒకటో తరగతి చదివే పిల్లలను తల్లిదండ్రులు రోజూ మండల కేంద్రానికి తీసుకురావడం, సాయంత్రం తీసుకువెళ్లడం ఇబ్బందిగా మారింది.
ఆటో అద్దె ఏడాదికి రూ.30వేలు
ముగ్గురు కూతుళ్లను మండల కేంద్రంలోని పాఠశాలకు పంపించేందుకు ఆటో అద్దె ఏడాదికి రూ.30వేలు చెల్లిస్తున్నాను. గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. వ్యవసాయంపై ఆధారడే మా కుటుంబం ఆటో అద్దె చెల్లించడం పెద్ద కష్టంగా మారింది.
ఒక టీచర్.. ఇద్దరు పిల్లలు
స్టేషన్ఘన్పూర్: చంద్రుతండా(జైత్యాతండా) జీపీ పరిధి ఎంపీపీఎస్ పాఠశాలలో 3, 5వ తరగతి సంబంధించి ఒక్కో విద్యార్థి ఉన్నారు. హెచ్ఎం సీహెచ్.రమేశ్ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ మోజులో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపకపోవడంతో ఆ పాఠశాల పరిస్థితి ‘ఒక్క టీచర్.. ఇద్దరు స్టూడెంట్స్’ అన్న చందంగా మారింది. ఇదిలా ఉండగా.. చంద్రుతండా జీపీ పరిధిలో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడితో నడిచిన మాన్సింగ్తండా పాఠశాల గత విద్యాసంవత్సరం మూతపడింది.
అసంపూర్తి చదువులు
కొడకండ్ల: కడగుట్టతండా ప్రాథమిక పాఠశాలలో 13 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉన్నారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక టీచర్ను మేఘ్యతండా పీఎస్కు డిప్యూటేషన్పై పంపించా రు. ‘మన ఊరు – మనబడి’ కింద రూ.20 లక్షల నిధులు మంజూరు కాగా, పాత భవనాన్ని తొలగించి కొత్త తరగతి గదుల కోసం స్లాబ్ వేసి చేతులు దులుపుకున్నారు.
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం
శిథిల గదులు.. చదువులు ఆగం