
అడవి నుంచి.. పుడమితల్లి ఒడికి
గాజర్ల రవి బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరగగా నాటి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.
వాతావరణం
ఉదయం నుంచి చల్లని వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
కలహాల కాంగ్రెస్...
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. అవి మాజీ
ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి.
– 10లోu
సమస్యల నిలయం శివునిపల్లి పీఎస్
స్టేషన్ఘన్పూర్ :శివునిపల్లి పీఎస్ సమస్యలకు నిలయంగా మారింది. మూడేళ్ల క్రితం ‘మన ఊరు–మన బడి’ కింద పనులు చేపట్టే సమయంలో ఉన్న త పాఠశాల మొదటి అంతస్తు తరగతి గదుల్లో 46 మంది ప్రాథమిక విద్యార్థులకు బోధన సాగిస్తున్నా రు. తలుపులు, కిటికీలు తొలగించి వదిలేశారు. పిల్లలు మొదటి అంతస్తుకు వెళ్లడం.. కిందికి దిగడం ప్రమాదకరంగా మారింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి.
చెట్ల కిందే చదువులు
రఘునాథపల్లి: కుర్చపల్లి ప్రాథమిక పాఠశాలలో 46 మంది విద్యార్థులకు నలు గురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల స్కీం కింద తరగతి గదుల స్లాబ్ తొలగించి రేకుల నిర్మాణం చేపట్టారు. ఫ్లోరింగ్ చేయకపోగా ట్యాంకు, కిటికీలకు తలుపులు బిగించలేదు. టాయిలెట్లు లేక విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. పైకప్పు రేకులు వేయడంతో ఉక్కపోత భరించలేక విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెడుతున్నారు.

అడవి నుంచి.. పుడమితల్లి ఒడికి