ఎల్కతుర్తి వైపే! | - | Sakshi
Sakshi News home page

ఎల్కతుర్తి వైపే!

Apr 27 2025 1:30 AM | Updated on Apr 27 2025 1:30 AM

ఎల్కతుర్తి వైపే!

ఎల్కతుర్తి వైపే!

దారులన్నీ

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

నుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు(ఆదివారం) నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్‌ జూబ్లీ వేడుకల కు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభ ఎల్క తుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి.

బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం

గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్‌ రోడ్డులో బాహుబలి సభావేదిక సిద్ధమైంది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్‌రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీ ఆర్‌ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుక కు కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గులాబీమయం

రజతోత్సవ సభతో ఎల్కతుర్తి గులాబీమయమైంది. బీఆర్‌ఎస్‌ మహాసభతో ఎల్కతుర్తి రజతోత్సవ శోభను సంతరించుకుంది. పార్టీ అధినేత కేసీఆర్‌, ఇతర నాయకుల కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలతో కళకళలాడుతోంది. పెద్ద వేదిక ఆపక్కనే కళాకారు ల ఆట–పాట కోసం ప్రత్యేకంగా మరో వేదిక ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్‌ ఇవ్వగా.. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన గ్రీన్‌, రెడ్‌ కార్పెట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు..

గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యవేక్షణ లో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌ అవిశ్రాంతంగా శ్రమించా రు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని కానిచ్చారు.

భారీ పోలీస్‌ బందోబస్తు

ఎల్కతుర్తి: సభకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్‌ సీపీ సన్‌ప్రిత్‌సింగ్‌ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో అవాంతరాలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషినల్‌ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 511మంది కానిస్టేబు ళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు డిస్ట్రిక్‌గార్డ్స్‌.. మొత్తం 1,100 మంది కిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్‌, సభాప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలు, ట్రాఫిక్‌ క్రౌడ్‌ కంట్రోలింగ్‌ ప్రాంతాల్లో సేవలందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement