
నేనూ వస్త బిడ్డా కేసీఆర్ సభకు..
9
జగిత్యాలరూరల్: ‘కేసీఆర్ను చూడాలవ్వ.. నేనూ వస్తా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు.. నన్ను ఎలాగైనా తీసుకెళ్లండి..’ అంటూ జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు చిన్నమల్లయ్య జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతను కోరారు. తాను కేసీఆర్ను చూస్తానని, తనను సభకు తీసుకెళ్లండని బతిమిలాడా రు. దీనికి వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు తప్పకుండా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
గ్రామగ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 27న గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించాలని వసంత సూచించారు. జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, ఆనందరావు, తుమ్మ గంగాధర్, మాజీ జెడ్పీటీసీ మహేశ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సునీత, స్వప్న పాల్గొన్నారు.
ఆంధ్రులు తెలంగాణకు వ్యవసాయం నేర్పారా..?
తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపర్చినట్టేనని వసంత అన్నారు. తెలంగాణ రైతులకు వెయ్యేళ్ల క్రితమే దక్కన్ ప్రాంతంలో వరి పండించిన చరిత్ర ఉందన్నారు.

నేనూ వస్త బిడ్డా కేసీఆర్ సభకు..