
రజతోత్సవ సభకు చీమలదండులా కదలాలి
● మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మల్యాల: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరూరా ప్రజలు, కార్యకర్తలు చీమల దండై కదలిరావాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. మల్యాల మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయడంలేదని విమర్శించారు. 16నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తితో ఉన్నారని, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రజతోత్సవ సభకు తరలివచ్చే ముందు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్, శ్రీలత, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్రావు, అయిల్నేని సాగర్రావు, జనగం శ్రీనివాస్ ఉన్నారు.