చిల్లర తిప్పలు తప్పేలా.. | - | Sakshi
Sakshi News home page

చిల్లర తిప్పలు తప్పేలా..

Apr 21 2025 8:01 AM | Updated on Apr 21 2025 8:01 AM

చిల్లర తిప్పలు తప్పేలా..

చిల్లర తిప్పలు తప్పేలా..

● ఆర్టీసీ బస్సు టికెట్ల జారీలో నగదురహిత సేవలు

కథలాపూర్‌(వేములవాడ): ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీలో చిల్లర డబ్బుల సమస్యలకు అడ్డుకట్ట పడింది. డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తేవడంతో సేవలు మరింత సులువుగా మారాయి. ఇదివరకు ఉన్న సాధారణ టిమ్‌ యంత్రాల స్థానంలో కొత్తగా ఈ– టిమ్‌ (ఎలక్ట్రానిక్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌) యంత్రాలను ప్రవేశపెట్టారు. దీంతో సెల్‌ఫోన్‌లో ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం, లేకపోతే ఏటీఎం కార్డుతో స్వైప్‌ చేసి నగదురహిత బస్సు టికెట్‌ పొందవచ్చు. ప్రస్తుతం దూరప్రాంతాలకు వెళ్తున్న సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లోనే కొన్ని నెలల క్రితం నగదురహిత డిజిటల్‌ సేవలను అమల్లోకి తెచ్చారు. కొద్దిరోజుల్లోనే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ– టిమ్‌ యంత్రాల వినియోగం మొదలవుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అధికారులకు, కండక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్నిరకాల వ్యాపారాల్లో డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులుండి చేతిలో నగదు లేకున్నా సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఏదైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కొత్తగా ఆర్టీసీ సైతం తమ బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానం అమల్లోకి తెచ్చింది.

మూడు డిపోలు.. 226 బస్సులు

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా 382 గ్రామాలున్నాయి. ప్రజలకు రవాణా సౌకర్యార్థం జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 226 బస్సులున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చడంలో బస్సులు సేవలందిస్తున్నాయి.

టికెట్‌ వెనుక రాసే పని లేకుండా..

బస్సుల్లో ఎక్కి టికెట్‌ తీసుకోగానే మొదట చిల్లర సమస్య ఎదురవుతోంది. చాలా మంది రూ.100, రూ. 200, రూ.500 నోట్లు ఇస్తుంటారు. చిల్లర ఇవ్వాలని కండక్టర్‌, లేవని ప్రయాణికులు అంటుంటారు. దీంతో టికెట్‌ వెనుక చెల్లించాల్సిన డబ్బులను కండక్టర్‌ రాసిస్తుంటారు. ప్రయాణికులు దిగే సమయంలో కండక్టర్‌ చెల్లిస్తుంటారు. ఒక్కోసారి మరిచిపోయి చిల్లర తీసుకోకుండానే ప్రయాణికులు దిగిపోయి నష్టపోతుంటారు. చిల్లర విషయంలో ఒక్కోసారి గొడవలు జరుగుతుంటాయి. ఈ– టిమ్‌ యంత్రాలతో ఇలాంటి చిల్లర సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. అటు కండక్టర్‌, ఇటు ప్రయాణికులకు సేవలు సులువుగా అందుతాయి. సమయం ఆదా అవుతోంది.

జిల్లాలోని డిపోల వారీగా

బస్సులకు మిషన్ల అవసరాలు ఇలా..

బస్సుల

సంఖ్య

ఈ– టిమ్‌లు

డిపో

(ప్రస్తుతం

వినియోగిస్తున్నవి)

కావాల్సినవి

జగిత్యాల 110 20 100(సుమారు)

మెట్‌పల్లి 54 06 60

కోరుట్ల 62 50 20

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement