ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా

Apr 20 2025 2:07 AM | Updated on Apr 20 2025 2:07 AM

ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా

ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా

ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలోని అసైన్డ్‌ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వే బ్రిడ్జిపై చర్యలు తీసుకోవాలనే స్థానికుల ఫిర్యాదుల మేరకు అధికారులు శనివారం స్పందించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి తీసుకున్న విద్యుత్‌ కనెక్షన్‌ను అధికారులు తొలిగించారు. వే బ్రిడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ట్రాన్సకో ఏఈ సంతోష్‌ రెడ్డి తెలిపారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, సర్వేయర్‌ రాజశేఖర్‌ వే బ్రిడ్జిని పరిశీలించారు. అసైన్డ్‌భూమి అని, దీనిని లీజుకు ఇవ్వకూడదన్నారు. ఉన్నతాధికారులకు దీనిపై నివేదిస్తామని ఆర్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. అనుమతిలేని వే బ్రిడ్జి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని పంచాయతీ కార్యదర్శి బద్రు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement