కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్‌ కమిషనర్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్‌ కమిషనర్ల నియామకం

Mar 25 2025 1:31 AM | Updated on Mar 25 2025 1:28 AM

కోరుట్ల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి బల్దియాలకు ఎంపీడీవోలే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈనెల 22న ‘ఇదేమి తీరు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కథనానికి మున్సిపల్‌ ఉన్నతాధికారులు స్పందించారు. మూడురోజుల క్రితం జగిత్యాల మున్సిపాలిటీకి రెగ్యులర్‌ కమిషనర్‌గా స్పందనను నియమించారు. ఇదే క్రమంలో సోమవారం కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌గా అల్లె మారుతీప్రసాద్‌ను నియమించారు. ఇన్‌చార్జిగా ఉన్న ఎంపీడీవో రామకృష్ణ నుంచి ప్రసాద్‌ బాధ్యతలు తీసుకున్నారు. మారుతి ప్రసాద్‌ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. మున్సిపల్‌ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

ధర్మపురి మున్సిపల్‌ కమిషనర్‌గా రాజశేఖర్‌

ధర్మపురి: ధర్మపురి బల్దియా కమిషనర్‌గా కల్లెడ రాజశేఖర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పెగడపెల్లి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి ఇన్‌చార్జి ఇచ్చారు. తాజాగా రాజశేఖర్‌ను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్‌ కమిషనర్ల నియామకం1
1/2

కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్‌ కమిషనర్ల నియామకం

కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్‌ కమిషనర్ల నియామకం2
2/2

కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్‌ కమిషనర్ల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement