జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన

Mar 23 2025 9:05 AM | Updated on Mar 23 2025 9:01 AM

జగిత్యాల: జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాయికల్‌ ఎంపీడీవో చిరంజీవి ఇన్‌చార్జి కమిషనర్‌గా కొనసాగారు. సంగారెడ్డి జిల్లాలో మెప్మా ఏవోగా పనిచేస్తున్న స్పందనను కమిషనర్‌గా నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపాలిటీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇన్‌చార్జి కమిషనర్‌ చిరంజీవి, మున్సిపల్‌ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

నానో యూరియా వాడండి

సారంగాపూర్‌: నానో యూరియా వాడి రైతులు దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని విండో సీఈవో లైశెట్టి శివ, ఇఫ్‌కో కంపెనీ ప్రతినిధి శ్రీధర్‌ అన్నారు. స్థానిక సింగిల్‌విండో ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నానో యూరియాపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.2200 సబ్సిడీ భరిస్తోందని, రైతులకు మాత్రం రూ.270కి అందిస్తోందని అన్నారు. రసాయనాలు లేని నానో యూరియా వాడడం ద్వారా భూమి సారం మరింత పెరిగి, భూమి లోపలి పోషకాల సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో విండో డైరెక్టర్లు కోండ్ర రాంచంద్రారెడ్డి, కాయితి శేఖర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

కమిషనర్లొస్తున్నారు..

ఎంపీడీవోలకు ఇన్‌చార్జి ఇవ్వడంపై విమర్శలు

జగిత్యాల/కోరుట్ల: మున్సిపాలిటీ పాలనపై అవగాహన లేని ఎంపీడీవోలను జిల్లాలోని కొన్ని బల్దియాలకు ఇన్‌చార్జి కమిషనర్లుగా నియమించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ‘ఇదేమీ తీరు’ శీర్షికన శనివారం ప్రచురించింది. ఈ క్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పందించింది. ముందుగా జగిత్యాల ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేస్తున్న రాయికల్‌ ఎంపీడీవో చిరంజీవిని తొలగించి సంగారెడ్డిలో మెప్మా ఏవోగా పనిచేస్తున్న స్పందనను నియమించింది. కోరుట్ల కమిషనర్‌గా ఉన్న తిరుపతి సస్పెండ్‌గా ఆయన స్థానంలో ఎంపీడీవో రామకృష్ణకు బాధ్యతలు ఇచ్చారు. అలాగే ధర్మపురి కమిషనర్‌ ఏసీబీకి పట్టుబడగా.. అతని స్థానంలో కూడా ఎంపీడీవోకు బాధ్యతలు అప్పగించారు. ఎంపీడీవోలకు కమిషనర్‌గా బాధ్యతలు ఇవ్వడంపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో మున్సిపల్‌ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి కమిషనర్లను నియమించాలన్న ఉద్దేశంతో కొందరు సాక్షి కథనాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగిత్యాలకు కమిషనర్‌ను నియమించినట్లే త్వరలోనే కోరుట్ల, ధర్మపురికి కూడా రెగ్యులర్‌ కమిషనర్లను నియమించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో కమిషనర్లు బదిలీ అయితే వారిస్థానంలో డీఈలకు, టీపీవోలు, మేనేజర్లకు ఇన్‌చార్జి కమిషనర్‌ బాధ్యతలు ఇస్తారు. ఎంపీడీవోలకు ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది.

పంట పొలాల వద్ద పాంపౌండ్లు నిర్మించుకోవాలి

కథలాపూర్‌: పంట పొలాల వద్ద నీటి నిల్వల కోసం పాంపౌండ్లను ఏర్పాటు చేసుకోవాలని భూగర్భజలశాఖ ఏడీ నాగరాజు తెలిపారు. మండలంలోని గంభీర్‌పూర్‌లో భూగర్భజలశాఖ, ఆదరణ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. వర్షకాలంలో నీటి నిల్వలు ఉండేలా రైతులు జాగ్రత్తపడాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఏవో యోగితా, అధికారులు శ్రీకుమార్‌, అకిల్‌, శ్రీలత, గంగాలక్ష్మణ్‌, లింబాద్రి పాల్గొన్నారు.

జగిత్యాల మున్సిపల్‌  కమిషనర్‌గా స్పందన1
1/3

జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన

జగిత్యాల మున్సిపల్‌  కమిషనర్‌గా స్పందన2
2/3

జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన

జగిత్యాల మున్సిపల్‌  కమిషనర్‌గా స్పందన3
3/3

జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement