Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’

Womens entry banned in tourist places in Pakistan  - Sakshi

ఇస్లామాబాద్‌: పర్యాటక, వినోదాత్మక ప్రాంతాల్లోకి మహిళలు కనిపించరాదంటూ పాకిస్తాన్‌లోని ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని గిరిజన మండలి తీర్మానం చేసింది. ఆ ప్రాంతాల్లోకి మహిళల ప్రవేశం అనైతికం, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది.

బజౌర్‌ గిరిజన జిల్లా సలార్‌జాయ్‌ తహసీల్‌కు చెందిన జిర్గా (గిరిజన మండలి) ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వం వెంటనే అమలు చేయకుంటే తామే ఆ పని చేస్తామంది. ఈ సమాశానికి జమియాత్‌ ఉలేమా–ఇ–ఫజుల్‌(జేయూఐ–ఎఫ్‌) జిల్లా చీఫ్‌ మౌలానా అబ్దుర్‌ రషీద్‌ నేతృత్వం వహించారు. పాక్‌ అధికార సంకీర్ణంలో జేయూఐ–ఎఫ్‌ ప్రధాన భాగస్వామి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top