ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ యువతి హత్య | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ యువతి దారుణ హత్య

Published Sun, Mar 10 2024 11:22 AM

Hyderabad Woman Murdered In Australia - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్‌ శ్వేత శనివారం హత్యకు గురైంది. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు.

హత్యకు సంబంధించి సెకండ్‌ క్రైమ్‌ సీన్‌ను పాయింట్‌ కుక్‌లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్‌ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపినతర్వాత దుండగులు వేరే దేశానికి పారిపోయారని తెలిపారు. హత్య చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. కాగా, శ్వేత భర్త, మూడేళ్ల కొడుకు హైదరాబాద్‌ వచ్చేశారు.  

ఇదీ చదవండి.. కర్రతో బాది యువకుడకి హత్య 

Advertisement
Advertisement