
ఎవ్రీడే ఇండియా ఫొటో ఎగ్జిబిషన్
మాదాపూర్: కళాకారులు తీసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ యం కోదండరాం అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్గ్యాలరీలో ఎవ్రీడే ఇండియా పేరిట ఫొటో ఎగ్జిబిషన్ను గురువారం ప్రారంభించారు. ఒక ఫొటో ఎన్నో భావాలను పలికిస్తుందన్నారు. పల్లెటూరి వాతావరణంలో సహజ సిద్ధ జీవన శైలిని తెలిపే చిచ్రాలు ఉన్నాయని కొనియాడారు. ప్రదర్శనలో 63 ఫొటోలు అందుబాటులో ఉన్నాయని, ఈనెల 19 వరకూ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.