
స్వాధీనం చేసుకున్న నగదు
చిక్కడపల్లి: బైక్పై తీసుకెళుతున్న రూ. 9.3 లక్షల నగదును సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ డి.శ్రీనివాస్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోలక్పూర్కు చెందిన అస్లామొద్దీన్ కాటేదాన్లో ప్లాసిక్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం అతను క్యారీ బ్యాగ్లో రూ.9.3 లక్షల నగదు తీసుకుని ఇంటికి వెళుతుండగా ఇందిరాపార్క్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అతడి వాహనాన్ని ఆపి సోదా చేవారు. ఈ సందర్భంగా రూ.9.30 లక్షల నగదును గుర్తించిన పోలీసులు అందుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.