తీవ్ర పని ఒత్తిడి పెంచిన ప్రభుత్వం
రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు చాలా వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది ముఖ్యంగా తక్కువ వయస్సు ఉన్న సెక్రటరీలు గుండెపోటుతో, బ్రెయిన్ స్ట్రోక్తో మరణిస్తున్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఏమైనా పర్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మల్టిపుల్ టాస్కులు ఇచ్చి తీవ్రమైన పని ఒత్తిడికి గురిచేసి బానిసల్లా చూస్తోంది. సచివాలయ ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. మల్టీపుల్ టాస్క్ల నుంచి సచివాలయ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలి.
వేధింపుల పర్వం
సచివాలయ సెక్రటరీలు రోజువారీ విధులతోపాటు, ప్రతి నెల ఇంటింటిరీ వెళ్లి పింఛన్లు పంపిణీ, మొన్నటి వరకు యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల ఆన్లైన్ సర్వేలతోపాటు ప్రస్తుతం సర్ ప్రక్రియ విధుల్లో ఉంటున్నారు. దీనిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సిబ్బంది విధుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్క టెలీకాన్ఫరెన్స్లు పెట్టడంతోపాటు లక్ష్యాలు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారంటూ సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. ఇటీవల బీఎల్ఓ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు పది మంది వరకు సచివాలయ సిబ్బంది సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో ఎక్కడ తమ మీద సస్పెండ్ వేటు పడుతుందో అని భయాందోళనలు చెందుతున్నారు.
● బీఎల్ఓ పనులు, రెగ్యులర్ విధులకు
తోడు అదనపు భారంతో సతమతం
● లక్ష్యాలు ఇచ్చి మరీ సిబ్బందిని తీవ్ర
ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు
● ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల
ఓ సచివాలయ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్
తీవ్ర ఒత్తిడి అనారోగ్యంపాలు
చంద్రబాబు సర్కారు అక్కసు
– ఆర్.అనిల్కుమార్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా చైర్మన్, జీడబ్ల్యూఎస్ఈఏ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ
సచివాలయ ఉద్యోగులపై పనిభారం రోజురోజుకీ పెరిగిపోతోంది. రెగ్యులర్ డ్యూటీలతోపాటు బీఎల్ఓ విధులు, ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు టార్గెట్లతో సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 162 సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ నాగూర్బాబు బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రి పాలయ్యారు. ఇదే విధంగా చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు.


