అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మార్చి 3, 4 తేదీలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీజీవోస్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూల్ షరీఫ్, జిల్లా ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ ఎస్ కె తాజున్నీసా, కన్వీనర్ ఎం విజయలక్ష్మీ, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


