విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీగా వెంకట రమణప్ప | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీగా వెంకట రమణప్ప

Jan 13 2026 6:07 AM | Updated on Jan 13 2026 6:07 AM

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీగా వెంకట రమణప్ప

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీగా వెంకట రమణప్ప

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీగా వెంకట రమణప్ప

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌) : విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్స్‌, వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వెంకట రమణప్ప గుంటూరులోని ఆ శాఖ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖకు ఇప్పటి వరకు జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దుర్గాభాయి ఇన్‌చార్జి ఏడీగా పనిచేశారు. దుర్గాభాయిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమైపె పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విభిన్న ప్రతిభావంతుల స్టేట్‌ డైరెక్టర్‌ బి. రవిప్రకాష్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను ఆదేశిస్తూ గత కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు విచారణ జరగుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వెంకట రమణప్పను నియమించారు.

క్రీడల్లో బాపట్ల జిల్లాకు ప్రాధాన్యం పెరగాలి

బాపట్ల: రాష్ట్ర స్థాయిలో ఒలింపిక్‌ గేమ్స్‌లో సి.డబ్ల్యూ.ఎస్‌.ఎన్‌ ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన ఎ.భార్గవ్‌ శ్రీరామ్‌, ఎం.రత్న కుమార్‌ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం లో మొదటి, మూడవ స్థానంలో విజేతలుగా నిలిచారు. రేపల్లె మండలం, ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎస్‌.కె.అహ్మద్‌ జోనల్‌ లెవెల్‌లో బాపట్ల జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు క్రీడల్లో ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement