
బిడ్డ చదువుకు అండగా నిలవాలి !
తెనాలి: తన బిడ్డ చదువుకు సంబంధించి అర్జీని సమర్పించేందుకుని ట్రై సైకిల్పై కార్యాలయానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని చూసిన సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి, సమస్య ఏమిటని ఆరా తీశారు. ఆయన చెప్పింది సావధానంగా విని అర్జీని తీసుకున్నారు. పరిశీలిస్తానని హామీనివ్వటంతో సంతోషపడ్డారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సమావేశం సందర్భంగా ఈ అంశం చోటుచేసుకుంది. పరిష్కార వేదికపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సబ్కలెక్టర్ సంజనా సింహా, వల్లభాపురంలో వివాహిత ఆత్మహత్యకు సంబంధించిన అంశంపై ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. సమస్యను తెలుసుకుని వారి నుంచి అర్జీని స్వీకరించిన సబ్కలెక్టర్, అక్కడికి దగ్గరలోనే దివ్యాంగుడు ఒకరు ట్రైసైకిల్పై ఉండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ కింద తన కుమారుడును స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు. ఒకటి, రెండు తరగతులు ఉచితంగానే విద్యను అందించిన పాఠశాల యాజమాన్యం గతేడాది 3వ తరగతికి సంబంధించి రూ.22 వేలు, ఈ విద్యాసంవత్సరం రూ.8 వేలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. రైట్ టు ఎడ్యుకేషన్ కింద చేర్చుకున్నారు కదాని అడిగితే ఆ ఒప్పందం గతేడాదితో రద్దయిందని చెబుతున్నారని సబ్ కలెక్టర్కు విన్నవించారు. పరిశీలిస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహా హామీనిచ్చి, అర్జీని తీసుకున్నారు.
దివ్యాంగుడి వినతి
దగ్గరకెళ్లి అర్జీని స్వీకరించిన
సబ్కలెక్టర్ సంజనా సింహా