
విజ్ఞాన్ విద్యార్థి రవితేజకు పీహెచ్డీ
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ విభాగానికి చెందిన విద్యార్థి వారాధి రవితేజకు తమ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందించిందని వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ‘‘యూరోపియం అయాన్ డోప్డ్ బోరేట్–సిలికేట్–ఫాస్ఫేట్ (బీఎస్పీ) గ్లాసెస్ ఫర్ ఆప్టో ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ : డబ్ల్యూ–ఎల్ఈడీ’’ అనే అంశంపై రవితేజ పరిశోధన చేశారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ మోడెం శ్రీనివాసులు గైడ్గా వ్యవహరించారని తెలిపారు. తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 ఎస్సీఐ ఇండెక్డ్స్ జర్నల్స్లో పేపర్స్ పబ్లిష్ చేశారని వెల్లడించారు. ఈయన ప్రస్తుతం విజ్ఞాన్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా సెంటర్లో అసిస్టెంట్ మీడియా మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డాక్టరేట్ పొందిన వారాధి రవితేజను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, గౌరీశంకర్, డీన్లు, తదితరులు అభినందించారు.