
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోకి కొలకలూరు గ్రామానికి చెందిన గమిడి రామారావు(58) అనారోగ్య కారణాలతో సోమవారం అర్ధరాత్రి దాటాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం మంగళవారం వెలుగు చూడడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
క్వారీ గుంతలో పడి యువకుడు మృతి
గుంటూరు రూరల్: క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన కట్టెపోగు నాగరాజు (30) ఆటోడ్రైవర్. అతనికి భార్య రూపకోటేశ్వరి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మరో రెండు రోజుల్లో రూపకోటేశ్వరి ప్రసవించనుందని వైద్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన నాగరాజు సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. తెల్లక్వారీ గుంత వద్ద నాగరాజు చెప్పులు, పక్కనే అతని ద్విచక్ర వాహనం కనిపించాయి. మేడికొండూరు, నల్లపాడు పోలీసుల మధ్య సరిహద్దు వివాదం అనంతరం నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో మంగళవారం ఉదయం నుంచి వెతికితే నాగరాజు మృతదేహం లభ్యమైంది. బహిర్భూమికి వెళ్లి జారి పడ్డాడా? కోతులు దాడి చేస్తే తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడా అని దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.