రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

Jun 18 2025 3:41 AM | Updated on Jun 18 2025 3:41 AM

రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

మంత్రి నాదెండ్ల మనోహర్‌

తెనాలి అర్బన్‌: తెనాలి – గుంటూరు రహదారి పునర్నిర్మాణ పనులను మంగళవారం చెంచుపేటలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెనాలి నియోజకవర్గంలో రూ.4.30 కోట్లతో 9 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చామన్నారు. తెనాలి – గుంటూరు రహదారి పునర్నిర్మాణం కోసం రూ.3.50 కోట్లు, గుంటూరు – హనుమాన్‌పాలెం రోడ్డు నిర్మాణం కోసం రూ.7 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఖాజీపేట వరకు పూర్తయిందని, మిగిలిన పనులు జూలై నెలాఖరులోపు పూర్తి చేసేలా చూడాలని ఆదేశించామన్నారు. రూ.800 కోట్లతో తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి గుంటూరుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాదిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తెనాలిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ ఈఈ సి.విశ్వనాథ్‌రెడ్డి, డీఈ డి.రాజేంద్రనాయుడు, ఏఈ బి.శివ నరసింహారావు, కౌన్సిలర్లు గోగిరెడ్డి మాసనరెడ్డి, కొమరబత్తుని జయపాల్‌, అధికారులు, పలువురు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement