గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు | - | Sakshi
Sakshi News home page

గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు

Apr 25 2025 8:08 AM | Updated on Apr 25 2025 8:08 AM

గంజాయ

గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు

సుమారు 300 గ్రాముల గంజాయి స్వాధీనం

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం రావడంతో గురువారం ‘ఈగల్‌’ టీమ్‌ పట్టణ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈగల్‌ విభాగాధిపతి ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు ఈగల్‌టీమ్‌ గురువారం మధ్యాహ్నం ఆ యువకులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 200 నుంచి 300 గ్రాముల వరకు గంజాయిని, గంజాయిని వినియోగించే త్రైస్‌ అనే పేరు కలిగిన రోల్స్‌ను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుల్ని విచారించగా మంగళగిరిలో ఓ యువకుడి వద్ద కొన్నామని, అతని వద్ద సుమారు 4 కిలోల వరకు గంజాయి ఉందనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

26 నుంచి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు

రెంటచింతల: రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎద్దుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌ రెడ్డి తెలిపారు. గురువారం రెంటచింతలలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సూర్యపేట మండలం మఠంపల్లి గ్రామంలో 25వ తేదిన జరిగే శుభవార్త దేవాలయ తిరునాళ్ల సందర్భంగా మాంట్‌ ఫోర్ట్‌ స్కూల్‌ (బ్రదర్స్‌ స్కూల్‌) ఆవరణలలో ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 25వ తేదీలోపు పేరు నమోదు చేసుకుని ఎంట్రీ ఫీజు రూ. 1000 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 96187 64924, 99896 96953, 99497 62633 ఫోను నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో యువజన సంఘం సభ్యులు గాదె పవన్‌రెడ్డి, తానం బాలరెడ్డి, కందుల కిరణ్‌ కుమార్‌రెడ్డి, సలిబండ్ల రాజేష్‌రెడ్డి, కొమ్మారెడ్డి రంజిత్‌రెడ్డి, గోపు అఖిల్‌రెడ్డి, గాదె మనీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

డీఈఓ చంద్రకళ

నరసరావుపేట ఈస్ట్‌: విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో చేరేందుకు అర్హులైన పేదలకు 25 శాతం సీట్లు కేటాయించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన చిన్నారుల తల్లిదండ్రులు ఈనెల 28 నుంచి మే నెల 15వతేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను http://creapgov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని వివరించారు. వివరాలకు ఆయా మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో డిఈఓ కార్యాలయంలో నోడల్‌ అధికారిగా సిఎంఓ పి.పద్మారావు, హెల్ప్‌ డెస్క్‌లో ఏపీఓ శంకరరాజును నియమించినట్టు తెలిపారు. వివరాలకు 4849851047, 9963192485 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు 1
1/1

గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement