
మున్సిపల్ కార్మికుల దీక్షకు సంఘీభావం
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల దీక్షలకు ఇఫ్టూ సంఘీభావం తెలిపింది. గురువారం ఇఫ్టూ ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇఫ్టూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు రూ.29 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అలాగే ఐఎఫ్టీయూ నాయకులు కూడా మద్దతు తెలిపారు.
డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో గురువారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 174 మందికి 171 మంది, మధ్యాహ్నం 189 మందికి 180 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది, మధ్యాహ్నం 140 మందికి 138 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 197 మందికి 193 మంది, మధ్యాహ్నం 215 మందికి 207 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
నేడు ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్పార్క్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
అన్ని కేడర్లనూ చూపించాలి
ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో అన్ని కేడర్ల ఖాళీలను బ్లాక్ చేయకుండా చూపించాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గురువారం డీఈఓ వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీ ఖాళీలను మాత్రమే కాకుండా హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను కూడా కోరుకునేలా అవకాశం కల్పించాలన్నారు. జేఏసీ నాయకులు ఎం.ఆదినారాయణ, జి.మోహన్, టి.రామారావు ఉన్నారు.
సాగుదారుల చట్టంపై ప్రచారోద్యమం
ఏలూరు (టూటౌన్): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ జా యింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చేతులమీదుగా పంట సాగుదారులు చట్టంపై ప్రచారోద్యమం కరపత్రాలను గురువారం విడుదల చేశారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బా షా మాట్లాడుతూ జిల్లాలో డీబీఆర్సీ 2025– 26కి గాను భూమి ఉన్న రైతులకు, కౌలుదారులకు మధ్య అవగాహనా కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమన్నారు. కౌలు కార్డు ల ద్వారా పథకాలు పొందవచ్చన్నారు.
ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల
ఏలూరు (ఆర్ఆర్పేట): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల మెరిట్ కార్డులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్సైట్లో అందుబాటులో ఉంచారన్నారు. మెరిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్, లాగిన్ (డీఎన్ఓ) ద్వారా అప్లికేషన్ను ధ్రువీకరించుకోవాలని కోరారు.